కెసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది – మంత్రి ఎర్రబెల్లి

-

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నేడు స్టేషన్ ఘన్పూర్ లో జరిగిన సభలో మంత్రి దయకర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ రాకముందు ఘణపూర్ ఎట్లా ఉండేదో, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో జనగామ జిల్లా మొత్తం ఎడారిగా ఉండేదన్నారు.

కేసీఆర్ పాలనలో జనగామ పచ్చగా మారిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. తాటికొండ రాజయ్య , కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి లు కలిసి ఉంటే స్టేషన్ ఘణపూర్ లో లక్ష మేజారిటి ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయాలని మంత్రి కేటీఆర్ ని కోరారు. అలాగే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఓ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news