అర్ధరాత్రి ఆశ్రమం నుంచి 14 మంది వ్యభిచారులు పరారీ..

-

హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో ఇటీవల హ్యుమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీం దాడి చేసింది. అయితే ఈ దాడుల్లో అందులో ఉన్న ఏకంగా 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న మహిళలు అందరూ 19 నుంచి 25 సంవత్సరాల మధ్య గల వారే ఉన్నారు.

అయితే కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమం లో చేర్పించారు. వీరి ప్రవర్తన లో మార్పు తేవాలని అలాగే సమాజంలో గౌరవంగా బ్రతికే ఎలా చేయాలని వీరికి అక్కడ 20 రోజుల శిక్షణ ఇస్తున్నారు. అయితే తాజాగా నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్రూం వెంటిలేటర్ విడగొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు.

ఈ నేపథ్యంలోనే ఉదయం వీరు కనిపించకపోవడంతో సిసి ఫుటేజీలను పరిశీలించారు ఈ సంఘటన బయటపడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పారిపోయిన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news