ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 25 నుంచి జులై 3 వరకు 36 రైళ్లు రద్దు

-

ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 25 నుంచి జులై 3 వరకు 36 రైళ్లు రద్దు కానున్నాయి. ఈ నెల 25 నుంచి జూలై 3 వరకు 36 రైళ్లను ద.మ రైల్వే రద్దు చేసింది. 25, 26 తేదీల్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు…24, 26 తేదీల్లో కాచిగూడ నుంచి రాయచూర్ మహబూబ్ నగర్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు. KNR నుంచి NZB, సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రైలను 26 నుంచి జూలై 3 వరకు రద్దు చేశారు.

KZP నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, WGP ప్యాసింజర్లు రద్దు అయ్యాయి. ఇక అటు వారం పాటు MMTS రైళ్లు రద్దు కానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 2 వరకు 22 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య MMTS రైళ్ళను నిలిపివేయనున్నారు. ఈ మార్గాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news