BREAKING : రంగారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి 4 గురు చిన్నారులు మృతి

-

రంగారెడ్డి జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. రంగా రెడ్డి జిల్లా యాచారం పరిధిలోని తాడిపర్తిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ సంఘటన లో మరణించగా… మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కూడా మృతి మరణించారు.

ఇక ఈ సంఘటన తెలియగానే.. ఘటనా స్థలానికి చేరుకున్నారు గ్రామస్తులు. అనంతరం చెరువులో నుండి మృతదేహాలు బయటికి తీశారు గ్రామస్తులు. ఈ సంఘటనతో.. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news