గాజులరామారంలో విషాదం.. ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

-

గాజులరామారంలో విషాదం చోటు చేసుకుంది.  ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.   మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్, వర్షణి, రిషికాంత్, విహంత్‌గా గుర్తించారు పోలీసులు.  భార్య, కొడుకులకు విషం ఇచ్చి ఆ తరువాత  ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు వెంకటేష్. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో రూ.25 లక్షల అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారం.

ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే  ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ ఘటన పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరు మరణం పై స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మా కళ్ల ముందే కనిపించిన వీరు ఇలా అవుతారని అస్సలు ఊహించలేదు. ఎంత అప్పు అయితే మాత్రం ఇలా ఆత్మహత్యకు పాల్పడుతారా..? అప్పులు అందరూ చేస్తారు.. ఇలా ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముంది..? అని పలువురు పలు విధాలుగా చర్చించుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news