హైదరాబాద్ లో కొత్తరకం డ్రగ్స్ పట్టివేత..!

-

తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. నిత్యం తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. పలువురు అరెస్ట్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ డ్రగ్స్ దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ నగరంలో కొత్త డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి.

అత్యంత ప్రమాదకరమైన ఖుష్, ఓజీ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. అలాగే రూ.4వేల విలువైన కుషి గంజాయి స్వామధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆప్రికా, అమెరికా దేశాల్లో ఎక్కువగా లభించే ఈ డ్రగ్స్ తాజాగా హైదరాబాద్ దొరకడం గమనార్హం.  అప్గానిస్తాన్ సరిహద్దుల్లోని హిందూ ఖుష్ కొండల్లో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను సాగు చేస్తున్నట్టు సమాచారం. తాజాగా  లాలాగూడలో రూ.10లక్షల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news