NTR పేరిట రూ.100 వెండి నాణెం.. ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మింట్‌ అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారు.

ఎన్టీఆర్‌ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరానని పురందేశ్వరి చెప్పారు. నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్‌ నుంచి ఆమోదం వచ్చిందని.. సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే విడుదల చేస్తారని ఆమె వివరించారు. తన తండ్రి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని.. దీన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి చెప్పారు. కేంద్రం నిర్ణయంతో ఎన్టీ రామారావు అభిమానులు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news