Telangana: గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!

-

Telangana: గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్థి. చదువు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విద్యార్థి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ (18) ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు.

A student committed suicide by jumping into the Godavari river

కాగా నిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. అయినా కూడా వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news