చెప్పులు మోయడం ఏంటి..తెలంగాణ పరువు తీశాడు – అద్దంకి

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ నేత అద్దంకి దయాకర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌.. అమిత్‌ షా బూట్లు పట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోయడం ఎంటి..? బీజేపీ మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

గుజరాతీ లకు గులాం లుగా బీజేపీ నేతలు మారిపోయారని ఆరోపించారు. బీజేపీ బానిసలను తయారు చేస్తుందని.. కాంగ్రెస్ నాయకులను తయారు చేస్తుందని స్పష్టం చేశారు. బానిస బతుకులు కోరుతుంది బీజేపీ అని… తెలంగాణ ఆత్మగౌరవాన్ని బండి సంజయ్..అమిత్ షా కాళ్ళ దగ్గర పెట్టారని రెచ్చి పోయారు కాంగ్రెస్‌ పార్టీ నేత అద్దంకి దయాకర్. బీజేపీ లోకి వెళ్లాలని ఆనుకునే వాళ్లంతా వాళ్లకు బానిసలేనని మండిపడ్డారు. ఇప్పటి కైనా బీజేపీ పార్టీకి వెళ్లిన నాయకులు మళ్లీ వెనక్కి రావాలని కోరారు కాంగ్రెస్‌ పార్టీ నేత అద్దంకి దయాకర్.

Read more RELATED
Recommended to you

Latest news