తెలంగాణలో విషాదం..పెళ్లి చేసుకొని పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య !

-

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకొని పురుగుల మందు తాగి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని ఉత్తరాసపల్లికి చెందిన శ్రీకాంత్‌(24)కు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బండ్లగూడ జాగీర్‌ కిస్మత్‌పురకు చెందిన పదోతరగతి చదువుతున్న ఓ బాలిక(16)తో పరిచయమైంది.

After getting married, the love couple committed by drinking pesticides

బాలిక మైనర్‌ కావడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవని గతనెల 27న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు.. తరువాత శ్రీకాంత్‌ తన గ్రామానికి ఆ బాలికని తీసుకురాగా, గ్రామస్థులు మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు పోలీసు కేసు అవుతుందని, ఆ బాలికని వాళ్ల ఇంటి దగ్గర వదిలిపెట్టమని అన్నారు. దాంతో కేసులకు భయపడి, కలిసి ఉండలేమని భావించి శ్రీకాంత్‌, ఆ బాలిక గతనెల 30న పురుగుల మందు తాగారు.. వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి బాలిక మృతి చెందగా, నిన్న ఉదయం శ్రీకాంత్‌ చనిపోయాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news