ఎంఐఎం ఇదేం రాజ‌కీయం?

-

స్వ‌ర్గీయ మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుని కాంగ్రెస్ పూర్తిగా వ‌దిలేసింది. ఆయ‌న పేరుని ఎత్త‌డం లేదు. దీంతో ఆయ‌నని, ఆయ‌న పేరుని తెలంగాన ముఖ్య‌మంత్రి మొత్తానికి కాంగ్రెస్ నుంచి హైజాక్ చేసేశారు. త‌న పార్టీకి చెందిన వారు కాక‌పోయినా తెలంగాణ వారు అను ప‌ల్ల‌వితో పీవీని కేసీఆర్ కీర్తించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో కాంగ్రెస్ వారు కూడా కొత్త‌గా పీవీ ప‌ల్ల‌వి అందుకున్నారు. ఎంతగా కాంగ్రెస్ వారు పీవీ ప‌ల్ల‌వి అందుకున్నా కేసీఆర్ ముందు వారి ప‌ప్పులు వుడ‌క‌డం లేదు.

పీవీ మ‌న ఠ‌వీ అని అసెంబ్లీ సాక్షిగా కొనియాడిన కేసీఆర్ భార‌త‌దేశ ప్ర‌తిష్ట‌ని పెంచార‌ని, ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేశార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా పీవీ ప్ర‌స్థావ‌న తీసుకువ‌చ్చిన కేసీఆర్ తెలంగాణ ముద్దు బిడ్డ పీవీకి భ‌ర‌త‌ర‌త్నివ్వాల‌ని మంగ‌ళ‌వారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్ర‌‌వేశ పెట్టారు. దీనిపై కేసీఆర్‌తో పాటు ప‌లువురు గులాబీ నేత‌లు స్పందించారు. తెలంగాణ  కాంగ్రెస్ నేత‌లు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సండ్ర వెంక‌ట వీర‌య్య ఈ సంద‌ర్భంగా పీవీ సేవ‌ల్ని కొనియాడారు. పీవీకి భార‌త‌ర‌త్నం ఇవ్వాల్సిందేన‌ని, ఆయ‌న అన్ని విధాలా అర్హుడ‌ని స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ అంతా ముక్త కంఠంతో ఆమోదించింది. అయితే ఇంత‌గా జ‌రిగిన ఈ చ‌ర్చ‌కు తెరాస మిత్ర ప‌క్షం ఎంఐఎం గైర్హాజ‌ర్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మిత్రులుగా వుంటూ కీల‌క చ‌ర్చ జ‌రుగుతున్న వూళ ముఖం చాటేయ‌డం ఏంట‌ని, ఎంఐఎం ది ఇదేం రాజ‌కీయ‌మ‌ని ప‌లు రాజ‌కీయ పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల కోస‌మే గులాబీ పార్టీతో ఎంఐఎం దూరాన్ని మెయింటైన్ చేస్తోందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news