తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసిన అలీ

-

టాలీవుడ్ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ని కలిశారు. ఆలీ గవర్నర్ తమిళి ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈమధ్య ఫాతిమా ఎంగేజ్మెంట్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆలీ వివాహ పత్రికను గవర్నర్ తమిళిసై సౌందర్య కి అందజేశారు. స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రిక స్వీకరించిన తమిళి సై, తప్పకుండా వివాహానికి హాజరు అవుతారని ఆలీకి మాటిచ్చారు. ఆలీని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news