కాంగ్రెస్ గ్యారెంటీ బాండ్ బౌన్స్ అయింది.. హరీశ్ రావు సెటైర్లు..!

-

కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం హరీష్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరుగ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఫైర్ అయ్యారు. ఆరింటిలో ఐదు అమలు చేశామన్నారు.. అంతా అబద్దం అని కొట్టిపారేశారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. జనవరిలో ఆసరా పింఛన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.

నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో భట్టి విక్రమార్క అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడ డీఏలు ఇస్తామని.. మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేశామా..? అని జనం బాధ పడుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news