దేశంలోనే బీఆర్ఎస్ అత్యంత అవినీతి సర్కార్ : అమిత్ షా

-

దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. జనగామలో సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే స్కామ్ లపై దర్యాప్తు చేసి.. అవినీతి పరులను జైలుకు పంపుతామన్నారు. 4 శాతం మైనార్టీ రిజర్వేషన్ ను రద్దు చేస్తామని వెల్లడించారు. ఒవైసీకి భయపడే విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.

జనగాం ఎమ్మెల్యే భూ కుంభకోణాల్లో ఉన్నారని.. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. అంతేకాదు.. బైరాన్ పల్లిలో అమరవీరు స్మారకం నిర్మిస్తామన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అన్నీ కుటుంబ పార్టీలేనని.. విమర్శలు గుప్పించారు. 2జీ పార్టీ అంటే.. కేసీఆర్, కేటీఆర్ పార్టీ మూడు తరాల నేతల ఎంఐఎం అంటే 3జీ పార్టీ.. 4 జీ అంటే 4 తరాల నెహ్రు, ఇందిరా, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ పార్టీ అని విమర్శించారు. కానీ బీజేపీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news