300 సీట్లతో మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం – అమిత్‌ షా

-

300 సీట్లతో మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. జగన్ పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు.

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఇది ఇలా ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 15న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 15న భద్రాచలంలో శ్రీ సీతారాముల వారిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం పార్టీకి చెందిన పలువురు నేతలతో విడివిడిగా సమావేశం అవుతారని బిజెపి వర్గాలు తెలిపాయి. తర్వాత శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news