తెలంగాణలో పూర్తి మెజారిటీతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం – అమిత్‌ షా

-

తెలంగాణలో పూర్తి మెజారిటీతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదిక గా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. దక్షిణ భారతానికి ముఖద్వారంగా భావించే కర్నాటక ఎన్నికలు మాకు చాలా ముఖ్యం అని వివరించారు అమిత్‌ షా.

ఈసారి కర్నాటక, అదేవిధంగా తెలంగాణలో పూర్తి మెజారిటీతో పక్కా బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడి నుంచే దక్షిణ భారతదేశంలో విస్తరిస్తామని ప్రకటించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా. కాగా, రేపు తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బహిరంగ సభలో కూడా మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news