చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తించారు..మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు – మేరుగ నాగార్జున

-

చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తించారు..మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని మంత్రి మేరుగ నాగార్జున వార్నింగ్‌ ఇచ్చారు. టీడీపీ రధ చక్రాలు ఊడిపోయి జగన్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే బాబు కొడుకు రోడ్ పై పడ్డారన్నారు. ఆదిమూలపు సురేష్ పై బరి తెగించి దాడులు చేశారని.. దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అనలేదా బాబు? అని నిలదీశారు.

దళితులకు మూలాలు లేవు అని బాబు చెప్తాడా అని ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున. దళితుల్ని భయపెడతావా చంద్రబాబు? రాజధానిలో దళితులు ఉంటే ఇబ్బంది అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఇవాళ రూట్ లెవెల్ నుంచి పాలన జరుగుతోందని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దళితులు పై దాడి చేస్తే వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఆదిముమూలపు సురేష్, విశ్వరూప్ అంటే తేలిగ్గా కనపడుతున్నారా చంద్రబాబు? అని నిలదీశారు. లోకేష్ దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు మంత్రి మేరుగ నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news