CBI అధికారులకు కేఏ పాల్ మరో లేఖ..

-

ఇటీవల కొత్త సెక్రటేరియట్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై ఎంక్వైరీ చేయాలని సిబిఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సెక్రటేరియట్ లోకి మీడియాను అనుమతించకపోవడం పై అనుమానాలు ఉన్నాయన్నారు.

గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు ఆరో ఫ్లోర్ కు ఎలా వ్యాపించాయని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో ఏం జరుగుతుందో దర్యాప్తు చేయాలన్నారు. అగ్నిప్రమాదం వెనక మర్మం ఏదో దాగుందని.. వెంటనే సెక్రటేరియట్‭ను క్రైమ్ జోన్‭గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదంపై కాంగ్రెస్, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయని కేఏపాల్ ప్రశ్నించారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‭కు అంబేద్కర్ పేరు పెట్టాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news