బ్రేకింగ్: తెలంగాణాలో మరో దేవాలయంపై దాడి

-

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండల పరిధిలో దేవాలయంలో దాడి జరిగింది. గౌడవళ్ళి గ్రామంలో శ్రీ మల్లికార్జున దేవాలయం లో ( మల్లన గుడి) లో మల్లన్న విగ్రహాలను ద్వంసం చేసిన దుండగులు…. గౌడవళ్ళి గ్రామంలో వెలసిన ఇలవేల్పు మల్లన్న దేవుని ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విగ్రహాలను నాశనం చేసారు.

ఈ రోజు ఉదయం నిత్య పూజ చేయడానికి వచ్చిన పూజరి, భక్తులు చూసే సమయానికి దేవాలయం తలపులు విరగ కొట్టి, విగ్రహాలను ద్వంసం చేసి ఉన్నారు అని అక్కడి స్థానికులు మీడియాకు చెప్పారు. తమ గ్రామంలో దేవాలయం లో అపచారం జరిగింది అని గ్రామస్థులు స్థానిక మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సీసీ ఫూటేజ్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news