బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు

-

రాష్ట్రంలో తాజా పరిస్థితులపై హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎలాంటి కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో కి వెళ్ళాలి అన్నదానిపై సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ నెలాఖరున రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని టూర్ ను సైతం రెట్టింపు ఉత్సాహంతో సక్సెస్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పై కూడా మంతనాలు జరిపారు.

bandi-sanjay
bandi-sanjay

జూన్ 23 నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. జూలై 12 వరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఆగస్టు చివరి లోపు నాలుగో విడత సైతం పూర్తి చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలు వరంగల్, ఖమ్మం, నల్గొండ, జిల్లాల్లో జరగనుంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర సాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కాగా పాదయాత్ర ఎక్కడ నుంచి ప్రారంభం అవుతుందన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news