పొరపాటున కేసీఆర్ గెలిస్తే… ఆర్టీసీ ఆస్తులు మిగలవు – బండి సంజయ్‌

-

పొరపాటున కేసీఆర్ గెలిస్తే… ఆర్టీసీ ఆస్తులు మిగలవు అంటూ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ ముగ్దుమ్ పురం ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 200 మంది నాయకులు బీజేపీలో చేరారు.

అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ….కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాలు రెడీ అయ్యాయని…99 ఏళ్ల లీజు పేరుతో దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవని… మీ పక్షాన యుద్దం చేస్తున్న నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మీపక్షాన పోరాడే నాలాంటోళ్లకు అండగా నిలవండని..కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ విజ్ఝప్తి చేశారు. సొమ్ము కేంద్రానైతే గంగుల సోకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆర్వోబీ, స్మార్ట్ సిటీసహా కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news