కేంద్రం నిధులతోనే తెలంగాణ నడుస్తుంది.. ప్రజలు బతుకుతున్నారు – బండి సంజయ్

-

కేంద్రం నిధులతోనే తెలంగాణ నడుస్తుంది.. ప్రజలు బతుకుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..అనంతరం మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చేసిన యాత్రలు చేసారని.. బీజేపీ కృషి ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. 1400 కోట్ల అమరుల బలిదానాలతో ఈ తెలంగాణ ఏర్పడిందని.. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు.
అన్ని అంశాల్లో కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తుందని వెల్లడించారు.

కేంద్రం నిధులతోనే తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది.. ప్రజలు బతుకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. నాలుగు లక్షల కోట్ల రూపాయల నిధులను తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందని చెప్పారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ మారింది..ఆశయాలకు భిన్నంగా తెలంగాణలో పాలనా సాగుతుందని పేర్కొన్నారు. నలుగురి వల్ల దేశంలో తెలంంగాణ రాష్ట్రం నవ్వులపాలయ్యింది.. మహిళలు, యువత, రైతులు ఎవరిని కలిసిన ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం.. ఏం జరుగుతుంది అని అడుగుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news