తెరాస పాలనలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం : బండి సంజయ్

-

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌), పట్టణపేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా), మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

‘‘తెరాస ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారు. 2021-22 బడ్జెట్‌లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ.3వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదు. ఆ తర్వాత 2022-23 బడ్జెట్‌లో రూ.1,250 కోట్లు కేటాయించినా.. ఆ నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందనే ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నిధులు విడుదల చేయాలి’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో సంజయ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news