సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని లేదా రిఫరెండమ్ కు సిద్ధం కావాలని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు సంజయ్. “గత ఎనిమిదేళ్లుగా అసమర్థ విధానాలను అనుసరిస్తున్న మీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై ఆరు వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని లేఖలో పేర్కొన్నారు సంజయ్.

ఈ ప్రజా వ్యతిరేక చర్యను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని లేదా పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రిఫరెండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రెఫరెండం కు ప్రభుత్వం సిద్ధపడి ముందుకు రాకపోతే బిజెపి తెలంగాణ శాఖ విద్యుత్చార్జీల పెంపుపై రిఫరెండం నిర్వహిస్తుంది. దానికి మీరు సిద్ధమా అంటూ లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news