తెలంగాణ రాష్ట్ర రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ

-

తెలంగాణ రైతు సోదరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర అని.. బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కు అయ్యాడని ఆరోపణలు చేశారు సంజయ్. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందని.. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్ చేశారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ అని.. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమే అని లేఖలో వివరించారు. సిఎం కేసీఆర్ కుట్రతో రైతన్నలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదమని.. అన్నదాతాలారా…. కేసీఆర్ కుట్రలను చేదిధ్దాం రండి…అని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి…రైతు పండించే ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

వడ్ల కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేళ్లలో ఇప్పటికే తెలంగాణకు రూ.97 వేల కోట్లను చెల్లించిందని.. వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని వెల్లడించారు. వడ్లను సేకరించి కేంద్రానికి అప్పగించకుండా టీఆర్ఎస్ సర్కార్ డ్రామాలాడుతోంది.. యాసంగి ధాన్యం సేకరణ వివరాలు కూడా కేంద్రానికి ఇవ్వలేదన్నారు. ఫిబ్రవరి 25 నాటి సమావేశ మినిట్స్ ను పంపించేందుకు సిద్ధమని.. కొనుగోలు కేంద్రాలను ఎందుకు మూసేశారో సీఎం జవాబు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news