మోదీ తనను అరెస్టు చేయాలని చూశారంటూ కేసీఆర్‌ కొత్త డ్రామా : బండి సంజయ్‌

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి మాజీ సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను అరెస్టు చేయించాలని చూసినట్లు కేసీఆర్ చెప్పారని.. అలా ఆయన కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించిన బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్లపై తీవ్రంగా విమర్శలు చేశారు.

కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని బండి సంజయ్ ఆరోపించారు. ఇక్కడి డబ్బులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ డబ్బులు దిల్లీ మద్యంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ, బొరుసుగా ఉన్నాయని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి చేయకపోతే సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనన్న బండి సంజయ్‌ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news