ముస్లిం టోపి ఎందుకు పెట్టుకున్నావ్‌..సిగ్గులేదా? : కేసీఆర్ పై బండి సంజయ్‌ ఫైర్‌

-

ముస్లిం టోపి ఎందుకు పెట్టుకున్నావ్‌..సిగ్గులేదా? అని సీఎం కేసీఆర్ పై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. మత రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న వంచకుడు కేసీఆర్ అని… రాష్ట్రంలో మతం పేరిట నీచమైన రాజకీయాలు చేస్తోంది కేసీఆరేనని నిప్పులు చెరిగారు. నిన్న ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీకి ఇఫ్తార్ విందు ఇచ్చి ఒవైసీ ఇచ్చిన టోపీ పెట్టుకుని అల్లాహో అక్బర్ అన్నవ్ కదా కేసీఆర్.. మరి ఒవైసీ నుదుట బొట్టు పెట్టే దమ్ముందా ? అని నిలదీశారు.

ఒవైసీ నోట ‘జై శ్రీరాం’ అన్పించే ధైర్యముందా ? దసరా, దీపావళి పండుగలకు, హనుమాన్, అయ్యప్ప దీక్షలప్పుడు ఒవైసీని ఎందుకు పిలవలేదు ? అని ప్రశ్నించారు. ఒవైసీ బొట్టు పెట్టుకోనప్పుడు… నువ్వు టోపీ ఎందుకు పెట్టుకున్నవ్ ? మరి నీకెందుకు సిగ్గు లేదు ? నిత్యం రాముడిని, అమ్మవారిని తిడుతూ 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఒవైసీకి ఇఫ్తార్ విందు ఇచ్చి అక్కడ నరేంద్రమోదీని, కేంద్రాన్ని తిట్టడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీని తిడితే ఎంఐఎం చాలా హ్యాపీగా ఫీలవుతుందని, తద్వారా రంజాన్ గిఫ్ట్ ఇచ్చినట్లయితదని కేసీఆర్ ఆ పని చేసిండట అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని… కేసీఆర్ ఫాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news