15 రోజులయింది కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉంది – బండి సంజయ్‌

-

15 రోజులయింది కేసీఆర్ కనిపిస్తాలేడు.. కేటీఆర్ పై అనుమానం ఉందంటూ బండి సంజయ్‌ వివాదస్పద వ్యాఖలు చేశారు. ఒక్కసారి కేసీఆర్ తో ప్రెస్మీట్ పెట్టించండి… మాకు నమ్మకం కలుగుతుందని వెల్లడించారు. మా ముఖ్యమంత్రిని ఒకసారి చూపించాలని కల్వకుంట్ల కుటుంబాన్ని కోరుతున్నామని.. బండి సంజయ్‌ పేర్కొన్నారు. కుటుంబం లో గొడవ స్టార్ట్ అయింది.. కేసీఆర్ వద్దకు ఎవర్నీ వెళ్ళనివ్వడం లేదు… ఆఖరికి సంతోష్ రావును కూడా దూరం పెట్టారని చురకలు అంటించారు.

కేసీఆర్ కుటుంబం ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా? మీకు వ్యాపారాలు లేనప్పుడు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలు బికారులు అవుతున్నారు.. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. దోచుకున్న సొమ్మును దేశవ్యాప్తంగా బీజేపీని దెబ్బతీసేందుకు వాడుతున్నారు.. బీసీ ప్రధాని అయితే ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహించారు. మీరు మీ భాషను చూసి తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారు… తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని వ్యతిరేకించిన చీటర్ అంటూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news