ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

-

ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా కల్పించడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడం వల్లనే కొవిడ్​ మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ నేతలతో కలిసి ఖమ్మం జిల్లా ఆస్పత్రిని భట్టి సందర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడారు.

Batti
Batti

కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.జిల్లాలో కరోనాను నియంత్రించడంలో మంత్రి పువ్వాడ అజయ్​ విఫలమయ్యారని భట్టి ఆరోపించారు. ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేయడం, హరితహారంలో మొక్కలు నాటడం అభివృద్ధి కాదన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత.. మంత్రి తీసుకోవాలని సూచించారు.కరోనా నియంత్రణలోకి వచ్చేంతవరకు గ్రామాల్లోని మద్యం దుకాణాలను మూసేయాలని భట్టి డిమాండ్​ చేశారు. అనుమానంతో వచ్చిన ప్రతీ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఐసోలేషన్​ కేంద్రాల్లో చికిత్స అందించాలన్నారు. వైద్యశాఖలో అన్ని స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news