కోడలు ఆత్మహత్య కేసులో సిరిసిల్ల రాజయ్య కు భారీ ఊరట

-

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కు భారీ ఊరట లభించింది. ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పై నమోదైన కేసు కొట్టివేసింది వరంగల్ జిల్లా కోర్టు. సిరిసిల్ల రాజయ్య కోడలు తమ పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవి పై గతంలో కేసు నమోదైంది. అయితే..ఈ కేసులో మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య…కుటుంబమే అసలు దోషులని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ కేసు లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ రోజు వరంగల్ జిల్లా కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది. ఇవాళ వరంగల్ జిల్లా కోర్టు.. విచారించి…ఈ తీర్పు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కు భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news