BREAKING : బీజేపీ ఆఫీసు ముందు ఉద్రిక్తత… అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

-

నిజామాబాద్ బిజెపి కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 13 మండలాల అధ్యక్షులను మార్చడం నిరసిస్తూ పెద్ద ఎత్తున బిజెపి ఆఫీసుకు చేరుకుంటున్నారు బిజెపి కార్యకర్తలు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీరును నిరససిస్తూ పార్టీ కార్యాలయం ముందుకు చేరుకున్నారు మూడు నియోజవర్గాల కార్యకర్తలు.

అంతేకాదు…నిజామాబాద్ బిజెపి కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు. నిజామాబాద్ బిజెపి ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు, సేవ్ బీజేపీ అంటూ ప్ల కార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్మూర్, బాల్కొండ, బోధన్ బీజేపీ శ్రేణులు పాల్గొంటున్నాయి. ఇంకా ఈ వివాదంపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news