తెలంగాణ రైతులకు శుభవార్త..రుణ మాఫీపై ఇవాళ కీలక ప్రకటన!

-

ఇవాళ తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఇవాళ అంటే సోమవారం నాడు మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద తెలంగాణ రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది.

ఇందులో భాగంగా.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినేట్ సమీక్షించనున్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినేట్ చర్చించనున్నది. అలాగే..రుణ మాఫీ పై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందట. ఈ రోజు కేబినెట్ సమావేశం తరువాత రుణ మాఫీ పై కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news