కవితకు మొబైల్ షాప్ ఉందా? అన్ని ఫోన్లు ఎందుకు?: విష్ణు

-

కల్వకుంట్ల కవితపై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్లను ఈడీకి అప్పగించిన BRS MLC కవితను ఉద్దేశిస్తూ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వాక్యాలు చేశారు.

‘ఆమె 9 ఫోన్లు ఎందుకు వాడారు? ఆమెకు మొబైల్ షాప్ ఉందా? షాప్ ఓనర్లు కూడా ఇన్ని ఫోన్లు వాడరు. క్రికెట్ బుకీలు, హవాలా, మనీలాండరింగ్ తరహా వ్యాపారాలు చేసే వాళ్లు మాత్రమే ఆమెలా ఎక్కువ ఫోన్లు వాడతారు. ఈ ఫోన్లు ఇస్తున్నారంటే ఆమె తప్పు ఒప్పుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. కాగా..మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగమేనని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత.. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news