రాహుల్ గాంధీకి పిచ్చి ముదిరిపోయింది : ఎంపీ లక్ష్మణ్

-

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం పని చేసింది. కానీ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకించింది అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాహుల్ గాంధీ తెల్లారి లేస్తే బీసిల మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ అనడం సంతోషమే. క్రీడాకారులు, మిస్ యూనివర్స్ ల్లో ఎంత మంది బీసీలు, ఎస్సీలు ఉన్నారని రాహుల్ గాంధీ లెక్కలు తీస్తున్నార. ఇది చూస్తుంటే రాహుల్ గాంధీకి పిచ్చి ముదిరిపోయింది అని అనిపిస్తుంది అని లక్ష్మణ్ అన్నారు.

ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కుల గణన జరిగింది.. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదో రాహుల్ గాంధీ చెప్పాలి. మొదటి బీసీ బిడ్డ ప్రజల మద్దతుతో మూడోసారి దేశానికి ప్రధాని అయ్యారు. లోక్ సభ ఎన్నికల సమయంలో మోదీని ఓడించేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారు . లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సంబురాలు జరుపుకుంది. కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు కూడా గెలవలేకపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఓడిపోయింది. వేర్పాటవాద నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ చేతులు కలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని బీసీల మీద రాహుల్ గాంధీకి ప్రేమ లేదు. ఆయన ప్రధాని అయ్యేది లేదు పోయేది లేదు అని ఎంపీ లక్షణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news