మోదీ తెలంగాణ పర్యటనపై రేపు బీజేపీ సన్నాహక సమావేశం

-

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణకి రానున్న విషయం తెలిసిందే. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ బిజెపి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో రేపు వరంగల్ లో సన్నాహక సమావేశం నిర్వహించేందుకు బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.

హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే సభ ఏర్పాట్లు, జన సమీకరణ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు రేపు ఒకే వేదిక పైకి రానున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, చుట్టుపక్కల ఉన్న మండల, ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పడిపోతుందనే ప్రచారానికి మోదీ పర్యటనతో చెక్ పెట్టాలని భావిస్తున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news