మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలి : కేసీఆర్

-

మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీల పారేసినట్లేనని.. కాంగ్రెస్‌కు వేయడం కూడా ఇంకా వేస్టేనన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. జోగు రామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ లోయర్‌ పెన్‌గంగా అని ఊరించారు. ప్రతి ఎలక్షన్‌లో ప్రామిస్‌ చేసుడే. ఒకే ఒక్కడు జోగురామన్న తన మాట నెలబెట్టుకొని చనకా కొరటా బ్యారేజీని పూర్తి చేయించాడు. ఆదిలాబాద్‌ చరిత్రలో ఎవరూ చేయలేదు. జోగు రామన్న ఒక్కడే నా వెంట పడి.. నన్ను కూడా పెన్‌గంగ కాడికి తీసుకువచ్చి చనకా కొరటా చేయిస్తున్నడు అని చెప్పాడు.

బీజేపీ భారతదేశంలో 150 మెడికల్‌ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు జిల్లాకోటి ఇవ్వాలని చట్టం ఉన్నా ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటుకూడా బీజేపీకి ఎందుకు వేయాలి? ఇవాళ బీజేపీకి ఓటువేస్తే మోరీలపరేసినట్లే అవుతుంది. వేస్ట్‌ తప్పా మనకు పనికివచ్చే గవర్నమెంట్‌ కాదు. ఈ రోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముళ్ల కలిసి ప్రేమతో ముందుకెళ్లే రాష్ట్రం ఇది. సదర్మాట్‌ను నిజాం రాజు కట్టాడు. ఎన్నో చెరువులు కట్టించారు. అందరం ఆనాటి నుంచి ఈనాటి దాకా కలిసున్నాం. ఇప్పుడు కలిసే ఉండాలి. మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్ప మీద పారేయాలి. బీజేపీకి ఒక్కవోటు వేసిన వేస్టే. కాంగ్రెస్‌కు వస్తే ఇంకా వేస్టే. రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలదే. గ్యారంటీగా రాసిపెట్టుకోండి అని చెప్పారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news