మునుగోడులో బిజెపి గెలుపు ఖాయం – బండి సంజయ్

-

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సర్వేలన్నీ మునుగోడులో బిజెపి విజయం ఖాయమని తేల్చాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికపై బండి సంజయ్ మంగళవారం పార్టీ నేతలతో ప్రత్యేకంగా టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, స్టీరింగ్ కమిటీ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో బిజెపి దమ్ము ఏంటో చూపించేందుకు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో మరో అవకాశం వచ్చిందని అన్నారు బండి సంజయ్. పార్టీ శ్రేణులంతా విజయం కోసం కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటుకు రూ. 30 వేల వరకు ఇచ్చి గెలవాలని టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ నిధులు ఇస్తుందని ఆరోపించారు.

బిజెపి దమ్ము ఏంటో చూపించి.. రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు అయ్యేవరకు మునుగోడు లోనే మకాం వేయాలని నేతలకు సూచించారు బండి సంజయ్. అలాగే ఈనెల 15 నుంచి చేపట్టవలసిన ఐదో విడుద పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news