ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బోయినపల్లి వినోద్

-

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో మోడీ రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారని అన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి , హామీలు కురిపించే నరేంద్ర మోడీ.. వరంగల్ సభలో ఒక్క రూపాయి ప్రకటించలేదని.. ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు.

తెలంగాణలో బిజెపి గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారని అన్నారు. మోడీతో సహా ఢిల్లీ బిజెపి నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారని ఆరోపించారు వినోద్ కుమార్. జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు అని.. విభజన చట్టం, పార్లమెంట్ లో ఆమోదం మేరకే రాష్ట్రానికి జాతీయ రహదారులు వచ్చాయన్నారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి.. ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

బిజెపిలోనే 200 మంది వరకు నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారని.. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోడీకి లేదని మండిపడ్డారు. కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్ కే పరిమితం అవుతాయని.. సినిమాలు మాత్రం విడుదల కావని సెటైర్లు వేశారు. బిజెపి ట్రైలర్ కూడా అలాంటిదేనన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి.. ఇప్పుడు తెలంగాణాలో అభివృద్ధి లేదనడం మోడీ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news