మాదాపూర్ లోని TCS ఆఫీస్ కు బాంబ్ బెదిరింపు కాల్

-

ఇటీవల కాలంలో బాంబు బెదిరింపుల గురించి నిత్యం వర్తల్లో చూస్తూనే ఉన్నాం. జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఈమధ్య ఎక్కువైంది. ఆగంతకులు, ఆకతాయిలు పలుచోట్ల బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటుచేసుకుంది.

మాదాపూర్ లోని టిసిఎస్ ఆఫీస్ లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక అనంతరం టిసిఎస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు ఉద్యోగులను బయటకు పంపించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కంపెనీకి చెందిన ఓ మాజీ ఉద్యోగి ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news