అసదుద్దీన్ అలుగుతాడనే విమోచన దినోత్సవం జరపట్లేదు – బూర నర్సయ్య గౌడ్

-

సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్ర దినోత్సవ వేడుకల వలే తెలంగాణకు విమోచన దినోత్సవం అంతే ముఖ్యం అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ అలుగుతాడో అనే విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్, బిఆర్ఎస్ జరపడం లేదన్నారు.

కాంగ్రెస్ మీటింగ్ వేరే ఏ తేదీలోనైనా జరపవచ్చని.. కానీ అదే రోజు జరపల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇక సీఎం కేసీఆర్ కాలేజీ ప్రారంభోత్సవం పేరుతో రాజకీయ సభకు తెర లేపాడని మండిపడ్డారు. సెప్టెంబర్ 17వ తేదీన సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news