బ్రేకింగ్: మరోమారు తెలంగాణాలో 3 వేల కేసులు

-

తెలంగాణాలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతుంది. రోజు రోజుకి తీవ్రత పెరుగుతూ పోతుంది. అన్ని జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 2 వేల 924 మంది కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులు 31 వేల 284 ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ లో 461, ఖమ్మంలో 181 కేసులు వచ్చాయి నిన్న.

90 వేల 988 మంది నేటి వరకు కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్క నాడే 1638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 10 మంది నిన్న మరణించారు. కరీంనగర్ లో 172 కేసులు నమోదు అయ్యాయి. లక్షా 23 వేలు దాటింది మొత్తం సంఖ్య… మొత్తం మరణాలు 818 గా ఉన్నాయి. రికవరీ రేటు గత 3 రోజుల నుంచి తగ్గుతుంది. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news