సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించింది : మంత్రి సీతక్క

-

సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దీంతో ఐదేళ్లుగా వారికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దీంతో సర్పంచ్ లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ములుగు పంచాయతీ పాలకవర్గం సభ్యులు మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లకు చెల్లించాల్సిన రూ.1,200 కోట్లను దారి మళ్లించిందని విమర్శించారు. దీంతో చాలా మంది సర్పంచ్ లు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తే… అన్ని చెల్లింపులు జరిపామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని అన్నారు.

కానీ ఇప్పుడు రికార్డులు అన్నీ పరిశీలిస్తే చాలా బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. వాటిని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా అని సర్పంచ్ లు ఇంకా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇంకా నెల రోజులు గడిస్తే వారి పదవీ కాలం కూడా ముగుస్తుందని తెలిపారు. అందుకే వారి సమస్యను కేబినేట్ మీటింగ్ లో చర్చిస్తామని, ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. .

Read more RELATED
Recommended to you

Latest news