నేటి నుంచి పంట పొలాలను సందర్శించనున్న గులాబీ నేతలు

-

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలను సందర్శించనున్నారు గులాబీ నేతలు. రైతుల పంట నష్టం వివరాలు సేకరించేందుకు ఇవాళ్టి నుంచే బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహిస్తారు. నిన్న ఉదయం ఈ మేరకు పార్టీ నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…రైతుల పొలాలు సందర్శించాలని బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు.

BRS leaders will visit the crop fields from today

ఇవాళ, రేపు, ఆ మరుసటి రోజు పొలాలకు వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని పిలుపునిచ్చారు కేసీఆర్. తక్షణమే ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్… నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలను సందర్శించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news