సెల్లార్​లో నిద్రపోతున్న పాపపై నుంచి వెళ్లిన కారు.. చిన్నారి మృతి

-

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ సెల్లార్‌లో పడుకోబెట్టిన పాపపై నుంచి కారు వెళ్లింది. పాప తలపై నుంచి కారు టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. అసలేం జరిగిందంటే..?

లెక్చరర్స్ కాలనీలో సెల్లార్ తవ్వకావని పనికి వచ్చిన తల్లి తన మూడేళ్ల పాప లక్ష్మిని పక్కనే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్‌లో పడుకోబెట్టింది. అదే సమయంలో ఆ అపార్ట్​మెంట్​లో నివసించే వ్యక్తి బయటి నుంచి కారులో వచ్చారు. తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో పాప పడుకుని ఉందని అతడు గమనించలేదు. ఈ క్రమంలో పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడే పడుకుని ఉన్న పాప పైనుంచి కారు వెళ్లడంతో… చిన్నారి మృతి చెదింది. పాప కోసం అక్కడికి వెళ్ళిన తల్లి మృతి చెందిన పాపను చూసి తల్లడిల్లిపోయింది. బతుకుదెరువు కోసం పనికి వచ్చి…. పాపను కోల్పోయామని మృతురాలి తల్లి కన్నీటి పర్యతమైంది. ఈ ఘటనకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news