సెన్సార్ బోర్డు సభ్యత్వం ఇష్యూలో మాజీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు

-

సెన్సార్ బోర్డు సభ్యత్వం ఇష్యూలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పై కేసు నమోదు అయింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయినట్టు సమాచారం. సెన్సార్ బోర్డులో సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ అయినట్టు సమాచారం. ప్రవీణ్ అనే వ్యక్తితో కలిసి రూ.10లక్షల మేర వరకు నగదు వసూలు చేసి మొండిచేయి చూపారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో బాధితులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆయన పై కేసు నమోదు అయిందని సమాచారం. ఈ మేరకు కపిలవాయి దిలీప్ కుమార్ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేయాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించిందని, ఈ మేరకు మంగళవారం ఆయన నోటీస్ తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని సమాచారం. ఈ వ్యవహారం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news