ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలపై షర్మిలా చర్చ..!

-

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోకసభ ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పరిణామాలను ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూలంకుశంగా చర్చ జరిగింది అని పేర్కొన్నారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై చర్చ జరిగింది. ఏఏ అంశాల ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అని అన్నారు.

అదే విధంగా కుల గణన, అదానీ విషయంలో “సెబీ” ప్రమేయం పై కూడా చర్చ జరిగింది. “సెబీ” లాంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందనే విషయాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే దానిపై చర్చించాం.క్షేత్ర స్థాయిలో కార్యాచరణపై సమావేశం నిర్ణయం తీసుకుంది.సమావేశంలో అందరి నుంచి అభిప్రాయలు తీసుకున్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యబద్దంగా అభిప్రాయాలు తీసుకోనడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అని షర్మిలా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news