BREAKING : జైల్లో ఉన్న చంద్రబాబు సంచలన నిర్ణయం

-

BREAKING : జైల్లో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని నిన్న మూలాఖత్ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు చెప్పారు.

ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని ఆయన సూచించారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా గత మూడు రోజుల నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే… యాదవ వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంచేందుకు సీఎం కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news