ఏపీలో ప్రభుత్వ మార్పు పై సీని నటుడు సమన్ కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది.

ఇక ఏపీలో ప్రభుత్వ మార్పుపై హీరో సుమన్ స్పందించారు. శనివారం సుమన్ తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5ఏళ్ళు వెన్నక్కి వెళ్ళిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news