భద్రాచలం చేరుకున్న సీఎల్పీ బృందం

-

అకాల వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ముంపు ప్రాంతాలను సిఎల్పీ బృందం పరిశీలిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో మంగళవారం కాంగ్రెస్ శాసనసభపక్ష బృందం పర్యటిస్తోంది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి లు భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరంరి వరద ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరారు.

విస్తా కాంప్లెక్స్, చెప్టా దిగువన పరిసరాల్లో ఇటీవల ముంపునకు గురై ఆర్థికంగా ఇబ్బందుల పాలైన వ్యాపారులను పరామర్శించి. అనంతరం సుభాష్ నగర్ కాలనీలోని ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శిస్తారు. భద్రాద్రి ఏజెన్సీలో పర్యటన ముగిసిన అనంతరం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం వెళ్ళనుంది సీఎల్పీ బృందం.

Read more RELATED
Recommended to you

Latest news