BRS నేతలతో..నేడు సీఎం కేసీఆర్ కీలక సమావేశం

-

నేడు సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆ సమావేశాల్లో బిఆర్ఎస్ కొనసాగించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఇవాళ భేటీ కానుంది.

మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్రానికి కేటాయింపులు, విభజన హామీలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news